ప్చ్.. మూడో భార్య చంపేస్తోందట

36
- Advertisement -

నరేష్ – పవిత్ర లోకేష్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అయితే, వీరి ప్రేమ తాలూకు వివాదం మాత్రం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా తన మాజీ భార్య రమ్య, రోహిత్ శెట్టి నుంచి తనకు ప్రాణహాని ఉందని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు నటుడు నరేష్. ఆస్తి కోసం సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకొని రమ్య నన్ను చంపేందుకు ప్రయత్నించిందని.. 2022 లో కొంతమంది ఆగంతకులు నా ఇంట్లో చొరబడ్డారని నరేశ్ అన్నారు. రమ్య వల్ల నేను నరకయాతన అనుభవించాను. నన్ను చంపేస్తారన్న భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్లడంలేదు అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.

రమ్య వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని.. నేను భరించలేకపోతున్నాను అంటూ.. తన మాజీ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నటుడు నరేష్. రమ్యకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా నా ఫోన్ హ్యాక్ చేసేది. ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ మెసేజెస్ చూసేది. దయచేసి నాకు కోర్టు ద్వారా రమ్య నుంచి విడాకులు ఇప్పించండి అంటూ పోలీసులను నరేశ్ ఆశ్రయించాడు. మొత్తానికి చిన్నగా మొదలైన నరేశ్ – రమ్య ఫిర్యాదు వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారేలా ఉంది.

ముఖ్యంగా నరేష్ తనను బాధ పెట్టిన రమ్య ను వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా నరేష్ – పవిత్రా లోకేష్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. తమను కొంతమంది అతి దారుణంగా వేధిస్తున్నారని పలు యుట్యూబ్ చానెళ్లపై సైబర్ క్రైమ్ పోలీస్ లకు కూడా ఈ జంట ఫిర్యాదు చేసింది. తన మూడో భార్య రమ్య రఘుపతినే డబ్బులు ఇచ్చి తమను ట్రోల్స్ చేయించింది అనేది నరేశ్ వాదన. ఇప్పుడు ఆయన రమ్య పై ఏకంగా హత్యా ఆరోపణలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

సత్యదేవ్ 26… ‘జీబ్రా’

ఆకట్టుకుంటున్న..రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

జమున లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు

- Advertisement -