ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల

1022
payyavula keshav
- Advertisement -

టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను శాసనసభ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవి కోసం సీనియర్ నేతలు పోటీపడినా చివరికి పయ్యావుల వైపే మొగ్గుచూపారు చంద్రబాబు.

అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి గెలిచిన పయ్యావుల అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా ఆయన ఓటమిపాలయ్యారు. తాజాగా టీడీపీ అధికారం కొల్పోయిన తరుణంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -