గ్రాండ్ పార్టీ చేసుకున్న ‘భీమ్లా నాయక్’ టీం..

107
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25న విడుదలై ఘనవిజయం అందుకుంది. ఈ నేపథ్యంలో, విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించిన భీమ్లా నాయక్ చిత్రబృందం ఆపై గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి.

పవన్, త్రివిక్రమ్, తమన్ సహా భీమ్లా నాయక్ టీమ్ కు పనిచేసినవాళ్లందరూ ఈ పార్టీలో దర్శనమిచ్చారు. కాగా, పవన్ కారు దిగి రాగా, బాణసంచాతో స్వాగతం పలికారు. పవన్ ను త్రివిక్రమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమాపై సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

- Advertisement -