పొత్తులపై పవన్ సంచలన కామెంట్స్..

21
- Advertisement -

టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో బీజేపీ చేరడం దాదాపు ఖాయం కాగా పొత్తులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పవన్. పార్టీ నేతలకు ప్రకటన విడుదల చేసిన పవన్..ఏపీ ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నానని..పార్టీ నేతలెవరు పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హుకుం జారీ చేశారు.

విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నాం అన్నారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమారన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని…పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

భావోద్వేగాలతో ఎలాంటి కామెంట్స్ చేయవద్దని..వ్యతిరేకంగా మాట్లాడితే అది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లవుతుందన్నారు. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాలన్నారు.

Also Read:అసెంబ్లీలో కేఏ పాల్..

- Advertisement -