సైకిల్ చైన్‌ తెంచిన కేసీఆర్:పవన్

304
pawan kcr
- Advertisement -

తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోందన్నారు జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌..టీడీపీ,వైసీపీలే టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. సైకిల్ పాతపడిపోయిందని…కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశారని ఎద్దేవా చేశారు.

వైసీపీని చూస్తే టీడీపీ భయపడుతోందని..వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ అన్నారు. రాజకీయాలు రెండు కుటుంబాలకేనా ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ఏపీ అభివృద్ది చెందాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు.

తానే ఏం చేసినా డైరెక్ట్‌గా చేస్తానని..బ్యాక్ డోర్ నుండి చేయని తెలిపారు పవన్‌. జగన్‌ మాదిరిగా వెళ్లి మోడీ కాళ్లు పట్టుకోనని విమర్శించిన పవన్ శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అవసరమా అని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించి ఏపీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

- Advertisement -