గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న జ‌న‌సేనాని

216
- Advertisement -

యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌)  ప్రకటించిన గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డును జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్‌ వెళ్లిన పవన్‌ ఈ అవార్డును తీసుకున్నారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్‌కు ఈ అవార్డును అందించగా, ఆ తర్వాత పలు అంశాలపై ఈయన మాట్లాడారు. ఇక వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన సభల్లోను పాల్గొన్నారు పవన్ . అవార్డు తీసుకోవడానికి ముందు లండన్లోని బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ని సందర్శించారు.

Pawan receives IEBF Award
టూర్‌లో భాగంగా ప‌వ‌న్ కల్యాణ్,యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు.2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నారు.రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండనున్న పవన్ కళ్యాణ్ లండన్ లో విద్యార్థులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ పర్యటనలో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ మొత్తాన్ని  అలాగే కార్యక్రమాలను ఐఈబీఎఫ్ నిర్వాహకులు చూసుకుంటున్నారు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తోన్న తన 25వ సినిమా కూడా దాదాపు ఏండింగ్ కు వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.

https://youtu.be/80Jo0WD0K1o

- Advertisement -