వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ

64
pawan
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృక్ష ప్రేమికుడు,పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో కాల్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.

రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని…పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి కలిగిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రామయ్య.

- Advertisement -