Pawan:అందుకే జీతం తీసుకుంటా

15
- Advertisement -

తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు పవన్. ఇక జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా బుధవారం మంగళగిరిలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్.

ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేగా తాను జీతం తీసుకుంటాను ఎందుకంటే….ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని వెల్లడించారు.

తనకు జీతం ముఖ్యం కాదు..అంతకు మించి నా సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానని అన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వీలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించారని తెలిపారు.ప్రజలు బలమైన మార్పును కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెలో పెట్టుకుని చూసుకోవాలని కోరారు.

Also Read:ధర్మం దే విజయం..వీరమల్లు స్పెషల్ పోస్టర్

- Advertisement -