వైసీపీ నేతలకు పవన్ సీరియస్ వార్నింగ్..

85
pawan
- Advertisement -

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు జనసేనాని ఆయా జిల్లాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అగ్రనాయకత్వానికి ఈ అనంతపురం నుంచే తెలియజేస్తున్న… ఇంకొక్కసారి గనుక మీరూ.. మేం ప్రజల పక్షాన నిలబడి విధానాలపై మాట్లాడుతున్నాప్పుడు.. మీరు సీబీఎన్ (చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అని మాట్లాడుతున్నారు.. మరి మిమ్మల్ని సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. వాళ్ల పార్టీలోని చాలామంది ముఖ్య నాయకులను సీబీఐ దత్తత తీసుకుంటోంది. ఆ విషయం మర్చిపోవద్దు అని పవన్‌ ఘాటుగా స్పందించారు.

2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మీరు జనసేన పార్టీని టీడీపీకి ‘బీ-టీమ్’ అంటున్నారు. దీనిపై ఏదన్నా గట్టిగా మాట్లాడితే మీరు ఏడుస్తారని ఊరుకున్నా. ఇక నాకు కూడా సహనం పోయింది. ఇకపై మమ్మల్ని గనుక ‘బీ-టీమ్’ అన్నారంటే మిమ్మల్ని ‘చర్లపల్లి జైల్ షటిల్ టీమ్’ అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్ ఆట ఆడుకున్నారు. మీరేమీ దేశ సేవ చేయలేదు. మీరేమీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లు కాదు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడి జైల్లో కూర్చున్నవాళ్లు. మీరు మాకు నీతులు చెప్పకండి. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. అసలు ఆ స్థాయి కూడా లేదు మీకు” అంటూ పవన్‌ తీవ్రంగా పండిపడ్డారు.

- Advertisement -