వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు: పవన్

9
- Advertisement -

వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని తేల్చిచెప్పారు పవన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్ అని చురకలు అంటించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు అరుపులు, కేకలు పెట్టడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీకి ఈ ఐదేళ్లలో

వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, అయినప్పటికీ ప్రతిపక్ష హోదా అడుగుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. “ఇలా జరగాలని అనుకుంటే వారు జర్మనీకి వెళ్లిపోవాలి. జర్మనీలో రూల్స్ వేరేలా ఉంటాయి. అసెంబ్లీ స్థానాలను బట్టి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్ల శాతాన్ని మిగతా వాళ్లు పంచుకుంటారు. ఇలాంటి రూల్స్ ఇండియాలో లేవు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ నేతలు మంకిపట్టుపడితే వారు జర్మనీకి వెళ్లిపోవచ్చు” అని పవన్ చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెల్లాలని ఎద్దేవా చేశారు.

ఈ ఐదేళ్లలో మీకు రాదు..11 సీట్లతో ఆ హోదారాదు. ఇది చంద్రబాబు, జనసేన నిర్ణయం తీసుకునే విషయం కాదు. దానికి రూల్స్ ఉంటాయి అన్నారు. ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నన్ను ప్రధాన మంత్రి పక్కన కూర్చోబెట్టలేదు. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ అది మంత్రి హోదానే కాబట్టి మంత్రుల వద్దే కూర్చోబెట్టారు. రూల్స్‌ అలా ఉంటాయి. స్పీకర్ ఇవాళ ఉదయం నాకు ఎదురు వచ్చారు తనతో పాటు ముందుకు తీసుకెళ్లబోయారు.డిప్యూటీ సీఎంకి ఇటువంటి ప్రోటోకాల్ ఉండదని, నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను అన్నారు.

Also Read:హైదరాబాద్‌లో AMGEN ఇన్నోవేషన్ సైట్

- Advertisement -