మేజర్‌పై పవన్ ప్రశంసలు

185
pawan
- Advertisement -

అడవి శేషు ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగా 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రంపై తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా ఓ లేఖను రిలీజ్ చేశారు పనవ్. ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నా అని చెప్పారు.

ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించిందన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను అని తెలిపారు.

- Advertisement -