కొన్ని సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్కి సురేందర్ రెడ్డితో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కార్యరూపం మాత్రం దాల్చలదు. ఈ చిత్రాన్ని SRT ఎంటర్టైన్మెంట్స్కి చెందిన రామ్ తాళ్లూరి నిర్మించాల్సి ఉంది.
కోవిడ్-19, పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ షెడ్యూల్, అలాగే సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాతో బిజీ కావడం వంటి అనేక కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ను పూర్తిచేశారు. తాజాగా సురేందర్ రెడ్డి సినిమాకు కూడా డేట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది. తన హీరోలను స్టైలిష్గా చూపించడంలో సురేందర్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత కారణంగా, ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతంలో నిర్మాత రామ్ తాళ్లూరి, ఈ సినిమా జరుగుతుందో లేదో అనుమానం ఉన్నట్లు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ కథ వినగానే చాలా ఇష్టపడి, వారికి హత్తుకొని అభినందించారని ఆయన వెల్లడించారు.
Also Read:ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్

