అభ్యర్థులకు బీ -ఫారమ్ అందజేసిన పవన్

11
- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో జనసేన 21 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరపున పోటీ చేసే వారికి బీ ఫారమ్ అందజేశారు పవన్ కళ్యాణ్.

ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. తొలి బీఫారంను తెనాలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు పవన్ కల్యాణ్ అందజేశారు. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని…ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని తెలిపారు నాదేండ్ల. వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -