ఆ పాట కోసం చాలా శ్రమించా…

60
- Advertisement -

జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న పఠాన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పఠాన్ హీరోయిన్ దీపికా ప్రమోషన్‌లో భాగంగా టీవీ ఇంటర్వ్యూలకు తెగ ఇచ్చేస్తొంది. పనిలో పనిగా మీడియా ప్రతినిధులు బేషరం రంగ్ సాంగ్‌పై వివరణ కోరగా దీపికా తన దైన శైలిలో విభిన్నమైన సమాధానం చెప్పింది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో జాన్ అబ్రహం దీపికా షారుక్‌ ఖాన్ కలిసి నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన పఠాన్ సినిమాపై మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ముఖ్యంగా బేషరం రంగ్ సాంగ్ పాటపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే వాటిపై నటి దీపికా పదుకొణె ఇంతవరకు స్పందించలేదు. కాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మొదటి సారి స్పందించింది.

బేషరం రంగ్ పాట కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ పాటను చూస్తే అదేదో మండే ఎండలో, మంచి వెలుతురులో షూట్ చేసినట్లు ఉంటుందని కానీ నిజానికి ఆ పాట షూటింగ్ సమయంలో చల్లటి  గాలులతో నిండిపోయి లోకేషన్‌ ఉందని అన్నారు. అలాంటి లొకేషన్స్‌లో షూట్ చేయడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ పాటలో మనం చూస్తోన్న దానికి లోకేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.

ఇవి కూడా చదవండి…

ప్రమోషన్ కి రష్మిక దూరమెందుకు?

నాటి యధార్థ ఘటనలే..ఏవతన్ మేరే వతన్‌

యంగ్ హీరోలతో బాలయ్య ఫ్రెండ్ షిప్

- Advertisement -