మంత్రి కేటీఆర్‌ని కలిసిన పర్లపల్లి సర్పంచ్‌…

315
ktr
- Advertisement -

దీన్ దయాళ్ అవార్డు పొందిన పర్పల్లి గ్రామస్తులు మంత్రి కేటీఆర్‌ని కలిశారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలవగా వారిని అభినందించారు కేటీఆర్. పర్ల పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎం.భారతి, కుటుంబసభ్యులు ఉన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఊర్లలో రోడ్లు, టాయిలెట్స్, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రానికి 12 దీన్ ద‌‌యాళ్ అవార్డులు దక్కాయి.

అవార్డు పొందిన వారిలో కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామ సర్పంచ్ మడది భారతి, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ సర్పంచ్ తెడ్డు అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపెల్లి సర్పంచ్​వంగ లక్ష్మి, సిద్దిపేట జిల్లా మల్యాల సర్పంచ్ దరిపల్లి వజ్రవ్వ, ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి సర్పంచ్​పుండ్రు పోతారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్ సర్పంచ్ శైలజ, పెద్దపల్లి జిల్లా సుందిల్ల సర్పంచ్​దాసరి లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట సర్పంచ్​కల్వకుంట్ల వనజ, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య, పెద్దపల్లి డీపీవో గీత, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాం రెడ్డి, ఎంపీడీవో జయశీల ఉన్నారు.

- Advertisement -