విరాట్ రికార్డును బ్రేక్ చేసిన పాండ్యా..

2
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ , ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్ సాధించాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవ‌ర్ల‌లో 26 ర‌న్స్ ఇచ్చి ఓ వికెట్ తీసుకున్న హార్ధిక్… తర్వాత బ్యాటింగ్‌లో 16 బంతుల్లోనే 39 ర‌న్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి.

243.75 స్ట్ర‌యిక్ రేట్‌తో చెల‌రేగిపోగా దీంతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. సిక్స‌ర్‌తో టీమిండియాను అయిదుసార్లు గెలిపించాడు పాండ్యా. గ‌తంలో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అత‌ను బ్రేక్ చేశాడు. కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు సిక్స‌ర్‌తో భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించగా పాండ్యా ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read:అమెరికాలో వైభ‌వంగా ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు

- Advertisement -