టీఆర్ఎస్‌కు జై కొట్టిన పంచాయతీరాజ్ ఉద్యోగులు

203
errabelli
- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు పంచాయతీరాజ్ ఉద్యోగులు. ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి సురభీ వాణీదేవిలకు మద్దతిస్తున్నామని తెలిపింది తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ ఇంజినీర్స్ అండ్ స్టాఫ్ అసోసియేష‌న్. మంత్రిని క‌లిసినవారిలో అసోసియేష‌న్‌కు చెందిన వెంక‌ట్ రెడ్డి, ప్రకాశ్ రావు, శ్రీ‌నివాసులు, శంక‌ర‌య్య‌, ప్రభాక‌ర్, సాంబ‌శివారెడ్డి, జ్ఞానేశ్వర్, దయాక‌ర్ చారి, అజ‌య్ కుమార్, భార్గవి త‌దిత‌రులు ఉన్నారు.

హన్మకొండ‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుని క‌లిసి త‌మ మద్దతు లేఖ‌ను అందించారు పంచాయతీరాజ్ ఉద్యోగులు. ప్రభుత్వం చేప‌ట్టిన ప‌నులు, ప్రజ‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, అందుకే తాము టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మ‌ద్దతు ప్రకటిస్తున్నామని మంత్రికి తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారిని అభినందించి…. మ‌ద్దతిచ్చినందుకు వారికి ధ‌న్యవాదాలు తెలిపారు.

- Advertisement -