జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి- సీఎం కేసీఆర్‌

118
kcr
- Advertisement -

ఈ నెల 20వ తేదీ నుంచి చేప‌ట్ట‌బోయే ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్ల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు.

అయితే వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 20 నుంచి నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారు సీఎంను కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

- Advertisement -