ఉప ఎన్నికతో ఉత్తమ్‌కు సన్యాసం తప్పదు..!

466
- Advertisement -

వచ్చే ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూర్నగర్‌లో టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓటమి లేదు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో కూడా గెలుపు మాదే. 40 వేల మెజార్టీతో హుజూర్నగర్ స్థానాన్ని గెలుచుకుటున్నా౦. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా ఉత్తం.. పదవుల కోసం పాకులాడుతున్నాడు అని రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.

uttam

హుజూర్‌నగర్ ఉప ఎన్నికతో ఉత్తమ్ కుటుంబానికి సన్యాసం తప్పదు. కేటీఆర్‌ను బచ్చా అని స౦బోధిస్తున్న ఉత్తం.. రాహుల్ గాంధీ వయసు, అనుభవ౦ తెలుసుకొని మాట్లాడితే మంచిది. కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన. ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

ఓటమి భయంతో ఉత్తం చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. తన స్థాయిని మరిచి హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ స్థానిక అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని ఆంధ్ర అనడం అవివేకం. సైదిరెడ్డి పక్కా లోకల్. రూ.లక్ష రుణమాఫీ నాలుగు దఫాలుగా చేస్తామని ఎన్నికల ముందే చెప్పాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ జరగలేదని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -