పాక్‌ జైలులో ఇమ్రాన్ హత్య..సంచలనం?

6
- Advertisement -

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్య చేయబడ్డారని షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మరియు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రను అమలు చేశారని ఆరోపించింది బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. అయితే ఈ సమాచారానికి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లభించలేదు.

ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలుకు వెలుపల భారీగా గుమికూడిన ప్రజల ఫోటోలు, వీడియోలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులకు సహా కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించడం లేదని వచ్చిన సమాచారం అనుమానాలను మరింత పెంచింది.

పాకిస్తాన్ మరియు కొన్ని ఆఫ్గాన్ మీడియా నివేదికలు—అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారనే వార్తలను ప్రసారం చేస్తున్నాయి. బలూచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా ఖాతా సహా పలు ఖాతాలు ఈ ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి రావల్పిండీలోని అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆయనను ఎవరూ కలవకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం రూమర్లు వ్యాపించిన తర్వాత ఆయన సోదరీమణులు జైలును సందర్శించడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అనుమతించలేదు.

Also Read: కీర్తి-ధనుష్..ఆసక్తికర ముచ్చట!

- Advertisement -