పాక్ డ్రోన్‌ను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

349
Pak-drone
- Advertisement -

మొన్న ఓ డ్రోన్ భారత్ లో ప్రవేశించగా దాన్ని వాయుసేన కూల్చివేసిన సంఘటన మరువకముందే మరో డ్రోన్ సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్ లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చి వేశారు భారత సైన్యం. శనివారం ఉదయం 5 గంటల సమయంలో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లోకి పాక్ డ్రోన్ అడుగుపెట్టినట్టు గుర్తించడంతో సైన్యం దానిని కూల్చేసినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

దీంతో సరిహద్దు రక్షణ దళం డ్రోన్ వస్తున్న విషయాన్ని గమనించింది. తక్షణమే పాక్ డ్రోన్ ను కూల్చివేయడానికి దళాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో పాక్ డ్రోన్ వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. భారత్ లో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ డ్రోన్ తమ దళాల ధాటికి తోకముడిచిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

- Advertisement -