కల్లోలం రేపనున్న పడిపడి లేచే మనసు

218
shawanand
- Advertisement -

శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం ‘పడి పడి లేచే మనసు’. డిసెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 3న సాయంత్రం 4.30 గంటలకు కల్లోలం సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్. మాసిన గడ్డంతో శర్వా..సాయిపల్లవి వెనకాలే నడిచే ఈ పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

ఇటీవలే విడుదలైన టీజర్‌,ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 3.5 మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్‌లలో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

పద పద పదమని పెదవులిలా పరిగెడితే .. పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే .. తరుగుతోందే మదికాయాసం .. పెదవడుగుతోందే చెలి సావాసం .. అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. చుకొండల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాట చాలా అందంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. శోభి కొరియోగ్రఫీ .. జేకే ఫోటోగ్రఫీ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాట యూత్‌ని ఆకట్టుకునేలాఉంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ సాంగ్‌ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -