ముగిసిన బెంగాల్, అసోం రెండో దశ పోలింగ్..

115
Assam Election
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో గురువారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 39 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు నిర్వహించిన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు.

సాయంత్రం 5.30 గంటల వరకు పశ్చిమ బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79 శాతం ఓటింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 69 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ చేపట్టారు. భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నియోజకవర్గం కూడా ఈ రెండో విడతలోనే పోలింగ్ జరుపుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి కారణంగా జాతీయ మీడియా మొత్తం నందిగ్రామ్ పైనే దృష్టి పెట్టింది. నందిగ్రామ్ లో విజయం తమదంటే తమదేనని అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -