ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు..

50
ou
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన గిరిజన శక్తి విద్యార్థులను పోలీసులు హాస్టల్ దగ్గరికి వచ్చి అక్రమంగా అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లంబడిలకు జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ కలిపిస్తామని హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు అయిన ఇంత వరకు చేయలేదు అని మండిపడ్డారు.గిరిజనులు అనేక రకాలుగా నష్టపోయాం అన్నారు.గిరిజనులకు వెంటనే 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -