ఆస్కార్ టికెట్లు ఎంతకు కొన్నారంటే?

36
- Advertisement -

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకకు కేవలం కీరవాణి, చంద్రబోస్‌ల కుటుంబాలకు మాత్రమే నిర్వాహకులు ఉచిత పాస్‌లు ఇచ్చారట. దీంతో డైరెక్టర్ రాజమౌళి, ఆయన భార్య రమా, కుమారుడు కార్తికేయ, కోడలుతోపాటు రామ్ చరణ్, మరియు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కుటుంబానికి కూడా టికెట్లు కొనుగోలు చేశారు. మరి వీరి టికెట్లు కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.

ఒక్కొక్కరికి ₹20.6 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అంటే.. ఆస్కార్ టికెట్లు ఖర్చే కోట్లలో ఉంది. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించింది. అదేమిటో గానీ.. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన దగ్గర నుంచి.. ఈ పాట స్థాయి మారిపోయింది. అంతకు ముందు ఈ పాట నచ్చలేదు అన్నవారు కూడా.. ఇప్పుడు ఈ పాట తమకు మోస్ట్ ఫేవరేట్ సాంగ్ అంటూ హడావుడి చేస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ మాజీ క్రేజీ బ్యూటీ కరీనా కపూర్ కూడా చేరింది. నాటు నాటు పాట ఆస్కార్ సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఈ పాట తన కొడుక్కి ఫేవరేట్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పింది. నాటు నాటు పాట తన రెండేళ్ల కుమారుడు జెహ్‌ను కూడా ఆకట్టుకుందని తెలిపింది కరీనా. ‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు. ఈ పాటను తెలుగులో వినడానికే ఇష్టపడతాడు’ అని ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ చెప్పడం విశేషం.

ఇవి కూడా చదవండి…

విశ్వక్‌ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ: నివేదా

‘ఉగ్రం’నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ..

దేశమంతా ‘దసరా’ కోసం ఎదురుచూస్తోంది..

- Advertisement -