ఫ్రీ బస్..ఒరిజినల్ ఐడీ లేకుంటే అంతే!

33
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మంచి స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణించారు. సగటున రోజుకు 30 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవాళ్టి నుండి ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉంటేనే జీరో టికెట్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేశారు ఆర్టీసీ ఎంపీ సజ్జనార్. ఈ పథకాన్ని మహి ళలు,బాలి కలు, విద్యార్థిను లు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తు న ఉపయోగించుకుంటున్నారు.కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నా రని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నాం అన్నారు. ఫొటో కాపీలలు స్మార్ట్ ఫోన్ల లో చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అను మతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డు ల్లో చిన్నతనం నాటి ఫొటో లు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి అని సజ్జనార్ స్పష్టం చేశారు.అతి తక్కువ టైంలోనే ఈ స్కీంను అర్థం చేసుకుని.. చాలా చిత్తశుద్ధితో సమర్థ వంతంగా ఈ స్కీంను విజ యవంతంగా అమలు చేస్తో న్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు.ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూ ర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Also read:ఎక్కడికి పారిపోలేదు:పల్లవి ప్రశాంత్

జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యం గా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకో వాలని కోరారు. జీరో టికెట్‌ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు.ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొ న్నారు. ప్రయాణికుల రద్దీకి అను గుణంగా కొత్త బస్సు లను అందుబాటు లోకి తీసు కురావాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయిం చింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందు బాటులోకి వచ్చే ప్లాన్ చేస్తు న్నాం.అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడ కంలోకి వస్తాయని చెప్పారు.

- Advertisement -