ఆపరేషన్ సింధూర్.. క్రికెటర్ల హర్షం

22
- Advertisement -

పహల్హామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పట్ల దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందించారు. తామంతా సైన్యం వెంటే ఉన్నామని తెలిపారు.

ధర్మో రక్షతి రక్షితః, జై హింద్ కీ సేనా అని సెహ్వాగ్ తెలపగా ‘జై హింద్’ ఎక్స్‌లో ట్వీట్ చేశారు గౌతమ్ గంభీర్. ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్​ దృఢంగా, ఐక్యంగా ఉంటుంది. మన సాయుధ దళాల భద్రత, విజయం కోరుకుంటున్నా అని సంజీవ్ గొయెంకా (లఖ్​నవూ ఫ్రాంచైజీ ఓనర్) తెలిపారు.

మన భద్రతా దళాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఓకే దేశం, మనమంతా కలిసి నిలబడదాం అని వైభవ్ సూర్యవంశీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్, జై హింద్…సురేశ్ రైనా తెలిపారు. పహల్గామ్​లో మన అమాయక సోదరులపై దాడికి ఆపరేషన్ సిందుర్ పేరుతో భారత్ రియాక్షన్. జై హింద్ అని హర్భజన్ సింగ్ వెల్లడించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)

Also Read:సాయుధ బలగాలకు అండగా ఉంటాం: రేవంత్

- Advertisement -