ఇజ్రాయెల్‌..కొనసాగుతున్న భారతీయుల తరలింపు

23
- Advertisement -

ఇజ్రయెల్ – హమాస్ మధ్య యుద్ధం తారాస్ధాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు విమానాల్లో వందల మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకురాగా తాజాగా నాలో విమానంలో ఢిల్లీకి చేరారు 274 మంది భారతీయులు.

మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు. పాలస్తీనాలోని హమాస్ మిలిటింట్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేసింది. ఒకేసారి 5 వేల రాకెట్ లను ప్రయోగించగా ఈ దాడితో ఇజ్రాయెల్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వైపులా వేలాది మంది ప్రాణాలను కొల్పోతున్నారు.

Also Read:BRS మేనిఫెస్టో – కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్

- Advertisement -