మైసవ్వ మంచి మనసుకు పోలీసులు ఫిదా..

176
police
- Advertisement -

రాజన్నసిరిసిల్లకు చెందిన మైసవ్వ మీ సేవలో కూలీ పని చేసుకుంటు గాంధీ నగర్లో రేకుల షెడ్డులో ఉంటున్న ఈ అవ్వ కు భర్త చనిపోయినాడు ఒక కొడుకు కూతురు ఉంది. గత రెండు నెలలుగా ఎండలో ఎంతో కష్టపడుతున్న పోలీసులను చూసి చలించి పోయిన మైసవ్వ తనకు తోచిన సహాయం చేయాలని 3 స్పైట్ బాటిళ్లు,3 ఫ్రూటి బాటిళ్లు తీసుకుని వచ్చి మాకోసం ఎండలో కష్ట పడుతున్నారు సారు దయచేసి మీరు ఈ కుల్డ్రిక్స్ తీసుకోవాలని కోరింది.

దీనికి స్పందించిన పోలీసులు అమ్మ మా కష్టాన్ని గుర్తించి నందుకు ధన్యవాదాలు అని తెలిపి ఆమె కోరిక మేరకు కాస్త కుల్ డ్రిక్స్ తీసుకొని నీ లాంటి తల్లి ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మేము కష్టాన్ని కూడ మరచి పోతా మని తెలిపారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో.. ఇది చూసిన తెలంగాణ డీజీపీ డిజిపి మహేందర్ రెడ్డి స్పందించారు. అర్ధం చేసుకునే మీలాంటి తల్లులు ఉన్నంత కాలం పోలీసులు ఎప్పటికి అలసిపోరని ట్విటర్‌ ద్వారా అమెకు ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై పోరాడుతున్న పోలీసులకు మీ ప్రేమపూర్వక మాటలతో బలం చేకూరినట్లయ్యిందని ఆయన అన్నారు.

- Advertisement -