శాంతి భద్రతల దృష్ట్యా ఇంటలీజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
-ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీకి వేళ్లే దారుల్లో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ దారుల్లో వెళ్లే వారు 100 ఫీట్ రోడ్డు, జియగూడ, రామ్సింగ్పురా, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి, చాంద్రాయణగుట్ట మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు.
-పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్ఘాట్ బ్రిడ్జి, చాదర్ఘాట్ కాజ్వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మలక్పేట్, ఎల్బీనగర్కు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
అబిడ్స్, కోఠి నుంచి ఎల్బీనగర్, మలక్పేట్, దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనదారులు.. నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక లేదా 6 నంబర్, రామంతాపూర్ మీదుగా చేరుకోవాలని సూచించారు.
-ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగమహల్, చాదర్ఘాట్, నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక మీదుగా చేరుకోవాలని తెలిపారు.
-దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహనదారులు.. ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా మీదుగా ప్రయాణించవచ్చని సూచించారు.
-ఓల్డ్ సిటీ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, లక్డీకాపూల్ వైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరాంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, మాసాబ్ట్యాంక్, లక్డీకాపూల్ చేరుకోవచ్చని పేర్కొన్నారు.
అల్లర్లు కంట్రోల్ చేయడానికే కాకుండా, ఈ సంఘటనల వలన ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.