కోలీవుడ్‌లో ‘ఒక్కడు మిగిలాడు’…

261
- Advertisement -

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యత గల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా సెప్టెంబర్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. శ్రీలంక ప్రభుత్వంతో పోరాడిన వేలు పిళ్లై ప్రభాకరన్ గా మనోజ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించిన మూవీ కనుక, ఇది తమిళులకు కనెక్ట్ అవుతుందని ఈ సినిమా టీమ్ భావించింది.

Okkadu Migiladu to release in Telugu, Tamil

అందువల్ల ఈ సినిమాను ‘నా తిరుంబి వరువేన్’ (నేను మళ్లీ తిరిగొస్తాను) టైటిల్ తో ఈ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నారు. అజయ్ నూతక్కి తెలుగువాడే అయినా .. దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నది తమిళంలోనే. అక్కడ ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులకి మంచి అభిప్రాయం వుంది. అందువలన మనోజ్ చేసిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకి మరింత చేరువయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

- Advertisement -