వాయిదా పడిన ‘ఒక్కడు మిగిలాడు’ …

193
- Advertisement -

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

"Okkadu Migiladu" Release Date Postponed

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఈఒక్కడు మిగిలాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

"Okkadu Migiladu" Release Date Postponed

వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు. చిత్రం విడుదల తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మనోజ్ నటన ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా చాలా అద్భుతంగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం లో మనోజ్ సరసన అనీషా అంబ్రోస్ నటించగా అజయ్, జెన్నిఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్ గునాజి ఇతర నటీనటులు. ఈ చిత్రానికి శివ నందిగాం సంగీతం అందించగా వి కే రామరాజు సినిమాటోగ్రఫీ, పి ఎస్ వర్మ ఆర్ట్. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు.

- Advertisement -