మంచు మనోజ్‌ డైలాగ్‌లకు ఫిదా…

238
Okkadu Migiladu Latest Trailer
- Advertisement -

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యత గల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  నవంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా సినిమా రెండో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజా ట్రైలర్‌లో మంచు మనోజ్ ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా .. విద్యార్థి సంఘం నాయకుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంకలో ఉంటు వాళ్లు శరణార్ధులు అన్నారు. మా దేశం అని ఇక్కడకు వస్తే మీరు శరణార్ధులు అంటున్నారు. ఇది మా దేశం కాదా సార్. మాకు దేశమే లేదా సార్ అంటూ మనోజ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది. మన భారత దేశ పౌరులం కాక ఈ దేశ పౌరులం కాక మరి మనం ఎక్కడి పౌరులం మన దేశమేది అంటూ ఉగ్రరూపాన్ని చూపించేశాడు మనోజ్.

- Advertisement -