సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్.’ గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘శివ’. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ మూవీతో వర్మ మార్క్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆఫీసర్’.
ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో నాగ్ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో నాగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు.
మాఫియా నేపధ్యంలో తెరకెక్కినట్లు ఈ మూవీలో నాగార్జున సరసన సరసన మైరా సరేన్ హీరోయిన్గా నటించింది. కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ మరియు షాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.