అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. తమన్నా ప్రధానపాత్రలో నటిస్తుండగా టీజర్ను మహాకుంభ మేళాలో విడుదల చేశారు. లేడీ అఘోరాగా తమన్నా విశ్వరూపం చూపించగా వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఓదెల పార్ట్ 2 ని మేకర్స్ ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకి కాంతార, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వర్క్ వారు నిర్మాణం వహించారు.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్డేట్