కోటీ మంది మెచ్చారు

319
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్‌లతో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. ఈ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించి బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది‌. తాజాగా కేవ‌లం యూ ట్యూబ్ లో కోటి వ్యూస్ సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

 ట్రైలర్ కి ఇంత భారీ రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మూవీ సంచలనాలు క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌటే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనుండగా, ఆయన సరనస రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. సెప్టెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -