తారక్ ను భయపెడుతున్న ఫ్యాన్స్ !

48
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఏ హీరోకు లేని మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ సొంతం. అందుకే ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్ వచ్చిన, లేదా పోస్టర్, టీజర్ వంటివి వచ్చిన అభిమానులు సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. అలాంటిది తారక్ అల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ అయితే ఆ హంగామా ఫిక్స్ కు చేరుతుంది. .

తాజాగా సింహాద్రి మూవీ విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ మూవీని మే 20న రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ కెరియర్ లోనే అల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ మూవీ మళ్ళీ రిలీజ్ కావడంతో తారక్ అభిమానులు థియేటర్ల వద్ద భీబత్సం సృష్టించారు. దాంతో ఇప్పటివరకు రీరిలీజ్ చేసిన మూవీస్ అన్నిటిలో సింహాద్రి అల్ వసూళ్లను అందుకొని రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంచితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్నాటకలో కూడా ఎన్టీఆర్ కు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సింహాద్రి రీరిలీజ్ కారణంగా కర్నాటక ఫ్యాన్స్ చేసిన ఓ పని ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది.

Also Read:నాలుగేళ్ల జగన్ పాలన.. ఏంటి పరిస్థితి!

కర్నాటకలోని రాబర్సన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు మేకలను బలి ఇచ్చి ఆ రక్తాన్ని ఎన్టీఆర్ కటౌట్ కు పోశారు. ఇందుకు సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తారక్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పై ఎన్టీఆర్ ను లక్ష్యంగా
చేసుకొని యాంటీ తారక్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర ” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రెల్ 5 న విడుదల కానుంది.

- Advertisement -