కరోనాను పక్కనపెట్టి రిస్క్ చేసిన ఎన్టీఆర్

242
ntr
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్త్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇటివలే ట్రైయల్ షూటింగ్ ప్రారంభించిన పర్మిషన్ లేకపోవడంతో క్యాన్సల్ చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో పాల్గోన్నారు. అందరూ కరోనాకు భయపడి షూటింగ్ లను క్యాన్సల్ చేసుకుంటే ఎన్టీఆర్ మాత్రం ఓ కూల్ డ్రింక్ యాడ్‌ షూటింగు యాడ్‌ను ఎన్టీఆర్ పూర్తి చేశాడు. కరోనా టైంలో కూడా ఎన్టీఆర్ పెద్ద రిస్క్ తీసుకున్నాడని అంటున్నారు నెటిజన్లు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ కొమురం భీం గెటప్ లో ఉన్నాడు.

అయితే ఈ యాడ్ కోసం రాజమౌళిని ఒప్పించి గెటప్ చేంజ్ చేశాడట ఎన్టీఆర్. కూల్ డ్రింక్ కంపెనీ నుంచి ఎన్టీఆర్ ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడట. ఇచ్చిన మాట ప్రకారం వాళ్ల కోసం యాడ్ ను చేశాడట ఎన్టీఆర్. పైగా ఈ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్లు బిగ్ బాస్ షో కు స్పాన్సర్ కూడా కావడంతో క్లిష్ట పరిస్ధితుల్లో యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈమూవీకి అయినను పోయిరావాలే హస్తినకు అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

- Advertisement -