‘ఎన్టీఆర్‌’ నుండి ఆకట్టుకునే మరో పాట‌..!

243
ntr
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, నందమూరి కల్యాణ్‌రామ్, రకుల్ ప్రీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రోజు(బుధవారం) ‘తల్లి ఏదీ.. తండ్రి ఏడీ? అడ్డు తగిలే బంధమేది? మనిషివో… ఋషివో… రాజర్షివో…’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

NTR Biopic

రెండు భాగాలుగా విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్ చేయగానే చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాటికి తోడు చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న పాటలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ పాట ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిస్థితులను తెలియజేస్తోంది. తెలుగు ప్రజలతో మమేకమవుతూ .. అహర్నిశలు వాళ్ల క్షేమం కోసం శ్రమించే మహాశక్తిగా ఆయన దూసుకుపోతుండటంపై ఈ పాట ప్లే అవుతుందని అనిపిస్తోంది.

సంగీతం .. సాహిత్యం .. ఆలాపన అద్భుతంగా కుదిరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -