పోస్టరెక్కిన తమన్నా..

274
tamanna jal lava kusha
- Advertisement -

నటన కంటే నర్తన విషయంలోనే ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయిక తమన్నా. అందుకే ఆమెకి అప్పుడప్పుడు ప్రత్యేక గీతం చేయమని ఆఫర్లు వస్తుంటాయి. మొదట్లో నో చెప్పినా అల్లుడు శీను నుంచి ఓకే చెప్పం మొదలు పెట్టింది మిల్కీ బ్యూటీ. అల్లుడు శీను తర్వాత స్పీడున్నోడు, జాగ్వార్‌ చిత్రాల్లోనూ స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన తమన్నా, మొదటిసారిగా ఎన్టీఆర్‌ జై లవకుశ సినిమాలో ప్రత్యేక గీతం చేసింది. తారక్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో స్వింగ్‌ జరా అంటూ సాగే పాటలో తమన్నా డ్యాన్స్‌ తో దుమ్ము రేపింది.

అయితే ఈ సినిమా ఫోస్టర్‌లలో ఎక్కువగా ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను మాత్రమే రిలీజ్‌ చేశారు. అయితే ఆ తర్వాత మెల్లగా చిత్ర కథానాయికలు కూడా పోస్టర్స్ లో దర్శనమిచ్చారు. మొదట రాశిఖన్నా పోస్టర్ ఎక్కింది. ఆ తర్వాత స్మైలి సుందరి నివేద థామస్ కూడా కొత్తగా పోస్టర్ లో పోజులిచ్చింది. ఇక ఫైనల్ గా స్వింగ్ జరా అంటూ ఎన్టీఆర్ తో చిందులు వేసిన మిల్కి బ్యూటీ తమన్నాని కూడా పోస్టర్ ఎక్కించారు. మొత్తానికి సినిమాలో ఈ ముగ్గురు గ్లామర్ షోతో హీటెక్కించారనే చెప్పాలి.

- Advertisement -