ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రత్యేక ఎన్నికల కమిటీ

26
- Advertisement -

ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యవర్గం లండన్ లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిధిగా హాజరై కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశం లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్.యస్ అభ్యర్థుల గెలుపుకై ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని దాని కోసం ఒక ప్రత్యేక ఎన్నికల కమిటీని రూపొందించి ప్రకటించారు.ఎన్నికల కమిటీ చైర్మన్ గా నవీన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా రవి ప్రదీప్ పులుసు వ్యవహరిస్తారని, అలాగే వీరితో పాటు దాదాపు 15 సభ్యులు ఉంటారని అశోక్ తెలిపారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రూపాల్లో వినూత్నంగా కెసిఆర్ గారి నాయకత్వంలో బీ.ఆర్.యస్ ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తోందని, ఎలాగైతే గతంలో అన్ని రకాల ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిందో రానున్న ఎన్నికల్లో సైతం అదే విధంగా పని చేస్తోందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ..నేడు సోషల్ మీడియా ప్రభావం అభ్యర్థుల గెలుపులో ఎంతో కీలకంగా మారిందని, ఉద్యమ సమయం నుండి ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే సోషల్ మీడియా వేదిక ద్వారా పార్టీ కి ఎంతో సేవలందించింది గుర్తు చేస్తూ రానున్న ఎన్నికల్లో సైతం పార్టీ అధికారిక సోషల్ మీడియా బృందం తో కలిసి పని చేస్తుందని, తప్పకుండా బీ.ఆర్.యస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు.

Also Read:యూత్‌ని అలరించే..‘నా.. నీ ప్రేమ కథ’

ఎన్నికల కమిటీ చైర్మన్ నవీన్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి ప్రదీప్ పులుసు లు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఎంతో ముఖ్యమైన బాధ్యతను ఇచ్చి ప్రోత్సహించిన అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్ దూసరి మరియు సహకరించిన కార్యవర్గానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారిని హ్యాట్రిక్ సీఎం చెయ్యడమే లక్ష్యంగా బీ.ఆర్.యస్ పార్టీ గెలుపుకై వివిధ కార్యక్రమాల్ని రూపొందించి, అటు క్షేత్రస్థాయిలో ని నాయకుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గారు నేడు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారని, ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా కెసిఆర్ గారే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని,బీ.ఆర్.యస్ ప్రభుత్వమే ఉండాలని తెలిపారు.తెలంగాణ ప్రజలు ఆశించినట్టు ఆకాంక్షించినట్టు ఎంతో అభివృద్ధి చేశారని, అదే విశ్వాసంతో ఏకధాటిగా ఒకేసారి 115 మంది అభ్యర్ధులని కెసిఆర్ గారు ప్రకటించారని , ఇలాంటి దమ్మున్న నాయకుడు దేశంలో ఎక్కడా లేరని, ఇలాంటి నాయకత్వాన్ని మనమంతా కాపాడుకోవాలని, ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలో కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు.

గులాబీ జెండా మోసే అవాకాశాన్ని అదృష్టాన్ని కల్పించడమే కాకుండా చైర్మన్ గా నియమించి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి, ఎల్ల వేళలా అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మంత్రి హరీష్ రావు గారికి, ఎమ్మెల్సీ కవిత గారికి, బీ.ఆర్.యస్ నాయకులకు కార్యకర్తలకు కార్యవర్గమంతా కృతఙ్ఞతలు తెలిపారు.ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించాలని, మన కోసం ఆలోచించే కెసిఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని, మోసపోతే గోసపడ్తామని, రానున్న ఎన్నికల్లో బీ.ఆర్.యస్ అభ్యర్ధులని భారీ మెజారిటీ తో గెలిపించి కెసిఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, హరినవాపేట్, వినయ్ ఆకుల, రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గొట్టెముక్కల సతీష్ రెడ్డి, సేరు సంజయ్,సత్యపాల్ రెడ్డి పింగళి, రమేష్ ఎసెంపల్లి, సృజన్ రెడ్డి, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ మామిడాల, ప్రశాంత్ కటికనేని, పృథ్వీ, ప్రశాంత్, మధు, రామకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Also Read:ప్రధాని రేస్ లో అమిత్ షా?

- Advertisement -