మోడీకి జై కొట్టిన రజనీ…!

222
Now Rajini looks at Modi
- Advertisement -

రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అయోమయంలో కొంత కాలంగా మౌనంగా ఉన్న సూపర్ స్టార్ రజనీ ఇంకా ఏటు తేల్చుకోలేక పోతున్నాడు. మరో సూపర్ స్టార్ కమల్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడమే కాదు కాషాయానికి దూరమంటూ తన స్టాండ్‌ ఏంటో ప్రజలకు తేల్చిచెప్పాడు.

కానీ ఇంకా సందిగ్దంలో ఉన్న రజనీ సొంతపార్టీ పెడతాడా లేదా అన్నదానిపై ఉహాగానాలు నెలకొనగా శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి జై అన్నారు రజనీ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ కు రజనీకాంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రజనీ  ‘పరిశుభ్రతను దైవ స్వరూపంగా అభివర్ణించారు.

‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నరేంద్ర మోదీ వివిధ రంగాల వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు.మోడీ  నుంచి లేఖలు అందుకున్న వారిలో రజినీకాంత్‌తోపాటు  మోహన్ లాల్, మోహన్ బాబు, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు వున్న సంగతి తెలిసిందే.

- Advertisement -