లండన్‌లో ఘ‌నంగా కేసీఆర్ – దీక్షా దివస్

273
Nov 29 Deeksha Diwas
Nov 29 Deeksha Diwas
- Advertisement -

లండన్ లో ఎన్నారై టిఆర్‌ఎస్ సెల్ – యూకే ఆద్వర్యం లో “కేసీఆర్ దీక్షా దివస్” ని ఘనంగా నిర్వహించారు. నవంబర్ 29 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటూ, లండన్ లో భారత హై కమీషన్ దగ్గరున్న నెహ్రూ విగ్రహం దగ్గర నుండి, సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు “శాంతి యాత్ర” నిర్వహించారు. ఈ సంధర్బంగా యూకే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

 unnamed (3)

ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలతో నివాళార్పించి యాత్రను ప్రారంభించారు. లండన్ వీధుల మీదిగా ప్రారంభమైన శాంతి యాత్ర, ” జై తెలంగాణా, జై కేసీఆర్ ” నినాదాలతో వీధులన్నీ మారు మోగాయి. మార్గ మద్యంలో ఎంతో మంది విదేశీయులు, కార్యక్రమ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకొని, తన ప్రజల కోసం కేసీఆర్ గారి శాంతియుత పోరాటపటిమను ప్రశంసించారు. చివరగా శాంతి యాత్ర సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న తరువాత గాంధీజీ విగ్రహానికి పూలతో నివాళార్పించి, అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

unnamed (2)

ఈ సంధర్బంగా ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ” తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో ” అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమం లో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనలును ఏకం చేసి, శాంతి యుత పోరాటాం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.

unnamed (1)

నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీ జీ – కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధానోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని – మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత.. నాయకుడు మన కేసీఆర్ అని ప్రశంసించారు.

నాడు ఉద్యమ నాయకుడే.. నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని.. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలు చాతనాయతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెప్తామని, సరియైన సందర్భం లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్తారని తెలిపారు.

unnamed

కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ…. లండన్ నుండి కెసిఆర్ గారు తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలన్ని, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ మరియు యావత్ టీఆర్‌ఎస్‌ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల,సభ్యులు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి చాడా, శ్రీకాంత్ పెద్డిరాజు, సురేష్ బుడగం , సతీష్ రెడ్డి బండ, సెరు సంజయ్, సత్యం రెడ్డి కంది,వినయ్ ఆకుల, నవీన్ భువనగిరి, ,సత్య చిలుముల,రవి ప్రదీప్, చిత్తరంజన్ రెడ్డి, రవి రావు,అశోక్,రవి కిరణ్, వెంకీ, శ్రీనివాస్ హాజరైన వారిలో ఉన్నారు.

https://youtu.be/2Fz5dZbIspU

- Advertisement -