- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు మహేశ్ బాబు.
మహేశ్ ఫొటోతో ఉన్న బ్రోచర్ లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు ఫిర్యాదుదారులు. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త నటుడు మహేశ్బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు.
Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!
- Advertisement -

