జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే.. సర్ధార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీతో సినిమా చేయబోతున్నాడనే సమాధానమే చెబుతారు. వరుస మూడు హిట్ల తర్వాత తారక్ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…ఇద్దరు మధ్య సినిమా కన్ఫామ్ అయిందనుకున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని..ఐటంసాంగ్ తో మరో ముద్దుగుమ్మ కూడా ఇందులో కన్పించబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సినిమాకు నట విశ్వరూపం అనే టైటిల్ కూడా ఖరారైనట్టు..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కణ్యామ్ నిర్మించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ వార్తలన్ని రూమర్లే అని తేలిపోయాయి.
ఈ రోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై స్పందించింది. ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై మీడియాలో వస్తున్న గాసిప్స్, హల్ చల్ చేస్తున్న వార్తలను ఒక్క మాటలో కొట్టి పారేసింది. అసలు ఆ వార్తల్లో నిజంలేదని అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ క్లారిటీ ఇచ్చింది.
తమ బ్యానర్లో సినిమా తీస్తుంటే… తమ ఆర్ట్స్ నుంచి అధికారికంగా ప్రకటిస్తాం.. అంతే తప్ప పుకార్లను నమ్మకండి అంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుందని…ఈ సినిమాకు బాబి డైరెక్టర్ అని వస్తోన్న వార్తలన్ని పుకార్లే అని తేలిపోయింది. దీంతో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆశతో ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ ప్రకటన పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది. మరి ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Lots of rumours circulating about the title as well as cast and crew of #NTR27. None of them are true.If it's official,it'll come from us.
— NTR Arts (@NTRArtsOfficial) December 26, 2016