జీవిత రాజశేఖర్‌పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

98
rajashekar
- Advertisement -

జీవిత రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. జీవితా రాజశేఖర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది చిత్తూరు జిల్లా నగరి కోర్టు. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జ్యోస్టర్ ఎండీ హేమ…జీవితపై ఫిర్యాదు చేశారు. అంతేగాదు తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు.

రూ.26 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలు విన్న నగరి జేఎఫ్‌సీఎం కోర్టు.. జీవితా రాజశేఖర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది. జీవితా రాజశేఖర్ ఆరోగ్యం సరిగా లేదని మెడికల్ రికార్డులను వాళ్ల తరపు న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు.

- Advertisement -