‘పుష్ప 2’ రేటు ఎక్కువే..కానీ లాభాలే లేవు

19
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా ఛానెల్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే, మరోపక్క ఓటీటీ రైట్స్ కూడా భారీగా అమ్ముడు పోయాయి అని టాక్ నడుస్తోంది. ఐతే నిర్మాతకు మాత్రం ఒక్క రూపాయి కూడా లాభం రావడం లేదు అని ఓపెన్ సీక్రెట్. పాపం అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టడానికి అల్లు అరవింద్ అన్ని రకాలుగా తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.

పైగా పుష్ప 2 కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్నారు. పుష్ప 2 కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. అల్లు అరవింద్ ముందు ఉండి.. అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో కేశవగా నటించిన జగదీశ్ ప్రతాప్ బండారి టీవల ఒక మహిళా ఆత్మహత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ఆరోపణ ఎదుర్కొని అరెస్ట్ అయ్యాడు. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 షూటింగ్‌పై పడింది. ఈ నేపథ్యంలో కేశవ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి జగదీష్ బెయిల్ పై జైలు నుంచి బయటకి తీసుకు వచ్చారు . మొదట అతనికి బెయిల్ రాకపోయినా, అల్లు అరవింద్ తన పరిచయాలు వాడి, ఎట్టకేలకు కేశవకి బెయిల్ ఇప్పించి.. పుష్ప 2 సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఏది ఏమైనా కొడుకు కోసం అల్లు అరవింద్ తనకున్న అన్ని శక్తియుక్తులను వాడుతున్నాడు. ఇక పుష్ప 2 మెగా డాటర్ నీహారిక కూడా ఓ కీలక పాత్రలో నటించనుంది. సినీ ఇండస్ట్రీలో మెగా వారసురాలిగా అడుగుపెట్టిన నిహారిక.. ముందు యాంకర్‌‌గా కెరీర్ మొదలుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వెబ్ సిరీస్‌లో అలరించిన నిహారిక.. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2లో కూడా నటిస్తోంది.

Also Read:ఎన్టీఆర్ vs బన్నీ.. బిగ్ ఫైట్ ?

- Advertisement -