తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కరోనా రాష్ట్రానికి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈ వైరస్ ఇక్కడ పుట్టినది కాదు. ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది.
ఈ 31 మంది కూడా దుబాయ్, ఇటలీ పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదు అని సీఎం చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘కరోనా’ వస్తే భయపడాల్సిన పని లేదని, ‘పారాసిటమాల్ గోలి’ వేసుకుంటే సరిపోతుందని ఇటీవల తనకు ఫోన్ చేసిన ఓ సైంటిస్ట్ చెప్పారని గుర్తుచేశారు.