రాష్ట్రంలో కరోనా లేదుః మంత్రి ఈటెల

356
Minister Etela
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని స్పష్టం చేశారు ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజెందర్. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొదటి రిపోర్టు నెగెటివ్ వచ్చిందని, రేపు మరోమారు ఈ వ్యక్తికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ రిపోర్టు కూడా నెగెటివ్ గానే వస్తుందని వైద్యులు భావిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నుంచి కొలుకున్నట్లు తెలిపారు.

.కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో మాట్లాడాను. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రతీ ప్రయాణికుడిని స్క్రీనింగ్‌ చేస్తున్నామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రతీ జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -