నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

309
election-commission-of-india
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 12న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 7న పోలింగ్ జరగనుంది.భూపతిరెడ్డిపై అనర్హ వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి ఎన్నిక జరగనుంది.

ఏప్రిల్‌ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 9వ తేదీ రోజు కౌంటింగ్‌ జరుగనుంది.

ఇప్పటికే జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్ధానాలను గెలుచుకుని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాటు స్ధానిక సంస్థల ఎన్నికలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రజలు,రైతులు ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్ధానాన్ని టీఆర్ఎస్ గెలుచుకోవడం లాంఛనమే కానుంది.

- Advertisement -